హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ శాఖలకు చెందిన ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27న వైద్యపరీక్షలు నిర్వహించనునట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందన్నారు.