శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్లో తనిఖీలు నిర్వహించిన సమయంలో ఏడుగురు గ్రౌండ్ వర్కర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రెండు హ్యాండ్ గ్రనేడ్లు, మూడు ఏకే రకం మ్యాగజైన్స్, 105 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై షోపియాన్ పోలీస్స్టేషన్లో భారత ఆయుధ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏడుగురు ఉగ్రవాదులు చోపాన్కు చెందిన సమీయుల్లా ఫరూక్, డచిపొరాకు చెందిన హిలాల్ అహ్మద్ వనీ, రమీజ్ వనీ, ముజాఫర్ అహ్మద్ వనీ, రౌఫ్ అహ్మద్, జాహిద్ హుస్సేన్ వనీ, ఫైజాన్ అహ్మద్ ఖాన్, షాహిద్ అహ్మద్ రాథర్గా గుర్తించారు. వీరి అరెస్ట్తో ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల పెద్ద నెట్వర్క్ విచ్ఛిన్నమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.