మునగాల, మే 17 : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న లాక్డౌన్ను సీఐ ఆంజనేయులు సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, లేనిచో కేసులు నమోదుతోపాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 20 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు నుంచి లాక్డౌన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణమూర్తి, పీసీలు బత్తుల శ్రీనివాస్, మోహన్బాబు, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్ : ఎస్ఐ
నేరేడుచర్ల : మండలంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నట్లు ఎస్ఐ యాదవేంద్రరెడ్డి తెలిపారు. సోమవారం సిబ్బందితో కలిసి పట్టణంలోని చౌరస్తా వద్ద పహారా నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బందోబస్తులో పోలీస్ సిబ్బంది సత్యనారాయణ, వీరాంజి, తమీజ్, కాశీ, రాంబాబు, యువరాజు తదితరులు పాల్గొన్నారు.
నిర్మానుష్యంగా రహదారులు
తిరుమలగిరి : కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మండల కేంద్రంలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. స్థానిక తెలంగాణ చౌరస్తాలో సోమవారం ఉదయం 10 గంటల తర్వాత అంతా నిర్మానుష్యంగా మారింది. పోలీసులు పటిష్టంగా లాక్డౌన్ అమలు చేసున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి జరిమానా వేస్తున్నారు.
నాలుగు వాహనాలకు జరిమానా
ఆత్మకూర్.ఎస్ : మండలంలోని నెమ్మికల్లో లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన నాలుగు వాహనాలకు జరిమానా విధించినట్లు ఎస్ఐ లింగం తెలిపారు.