Omelette Challenge | ఒక్క అయిదు నిమిషాల్లో ఒక్క ఆమ్లెట్ తింటే 21 వేల రూపాయలు గెలుచుకోవచ్చు. అంతే కదా! ఒక్క బుక్కలో తినేస్తా అనుకునేరు. ఆ పప్పులేం ఉడకవు. ఎందుకంటే ఏకంగా 40 గుడ్లతో చేసిన ఆమ్లెట్ అది. పశ్చిమ ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి వేసిన ఐడియా ఇది. ఫుడ్ చాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో రోజుకో సవాలు వైరల్ అవుతూనే ఉన్నది.
తాజా సవాలు ప్రకారం.. నలభై గుడ్లు, పనీర్, చీజ్, కూరగాయ ముక్కలు దట్టించిన ఆ ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తినేస్తే అక్షరాలా 21 వేల రూపాయలను గెలుచుకోవచ్చు. తినలేకపోతే మాత్రం ఆమ్లెట్ బిల్లు రూ.1999 కట్టాల్సిందే. రజనీశ్ అనే యూట్యూబర్ తన చానల్లో ఈ చాలెంజ్కి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో మిలియన్ల కొద్ది వ్యూస్, లైకులు, కామెంట్లతో వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు ‘భలే చాలెంజ్’ అంటుంటే, మరికొందరు మాత్రం ‘ప్రాణాలతో చెలగాటం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ చాలెంజ్ని ఇప్పటివరకు ఎవరూ గెలవలేదు.
“Burger Challenge | బర్గర్ తిని 5,100 గెలిచే ఛాన్స్.. ఓడిపోతే మాత్రం..”
“Samosa Challenge | ఈ సమోసా తింటే 11 వేలు ఇస్తారంట.. ఎందుకో తెలుసా!!
పిజ్జా తినడం అంటే ఇష్టమా? ఈ విషయం తెలిస్తే అస్సలు ముట్టుకోరు !!”
T Kitchen | తియ్యతియ్యని చాక్లెట్ సమోసా ఎప్పుడైనా రుచి చూశారా?”
“Fanta Noodles | నీళ్లతో కాకుండా ఫాంటాతో చేసే నూడిల్స్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా !!”