న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 18 కోట్ల ఉచిత వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇప్పటికీ రాష్ట్రాల దగ్గర 90 లక్షల ఉచిత వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. మరో మూడు రోజుల్లో మరో 7 ఏడు లక్షలకుపైగా ఉచిత వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు అందజేయనున్నట్లు చెప్పింది.