న్యూఢిల్లీ: టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఆట చూడటం తనకు చాలా ఇష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అతడు నిఖార్సైన ‘మ్యాచ్ విన్నర్’అని ప్రశంసించాడు. బోర్డు అధ్యక్షుడిగా ఎవరు ఇష్టమో చెప్పకూడదు కానీ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటను ఆస్వాదిస్తాను.. బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్ ఆట కూడా ఇష్టమే అని దాదా చెప్పాడు.