వినాయకుని మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు (గ్లాసులు), మూడు ఉద్ధరిణలు (చెంచాలు), ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, వక్కలు సిద్ధంగా ఉంచుకోవాలి.
పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభం (వెండి లేదా రాగి లేదా యథా శక్తి చెంబు)లో కొత్త బియ్యం వేసి, వినాయకుని విగ్రహం పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. గొడుగు పెట్టాలి.
పంచామృతం
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి చేసుకోవాలి.
వస్త్రములు
పత్తితో చేయవచ్చు.
మధుపర్కాలు
పత్తితో చేయవచ్చు.
యజ్ఞోపవీతం
పత్తితో చేయవచ్చు.
మహా నైవేద్యం – నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే శక్తిమేరకు రకరకాల పిండివంటలు చేయవచ్చు. తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్లు పోసుకొని, అందులో ఓ పుష్పం, ఉద్ధరిణ (చెంచా) ఉంచుకోవాలి.