ఇషా అంబానీ.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సంస్థకు డైరెక్టర్. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో రూ. ఎనిమిదివేల కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ‘రెండు సంస్థల భాగస్వామ్యం భారతీయ రిటైల్ రంగ స్వరూపాన్నే మార్చేస్తుంది’ అంటున్నది ఇషా ఆశావాదంతో. కార్పొరేట్ వ్యూహాలకు సంబంధించి తాతయ్య ధీరూభాయ్ బాటలో, నాన్న ముకేశ్ అడుగుజా.డల్లో నడుస్తున్నదీ పిరమల్ పరివారపు కోడలు. ఇషాను మనసున్న యువరాణిగా కీర్తిస్తుంది మీడియా. కారణం, రిలయన్స్ ఫౌండేషన్ ఛత్రం కింద ఆమె చాలా కార్యక్రమాలు చేపట్టింది. అనేక జీవితాలు మార్చింది.
స్టాన్ఫోర్డ్ డిగ్రీతో వారసత్వ ప్రతిభకు ప్రొఫెషనలిజం తోడైంది. అనుభవం కోసం, కొంతకాలం బహుళజాతి సంస్థ మెకెన్సీలో పనిచేసింది. అజియో.. ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్ వ్యవస్థాపకురాలు తను. ఇంటర్నెట్ దిగ్గజం జియో స్థాపనలోనూ చురుకైన పాత్ర పోషించింది. అత్తింటి వైపు నుంచి భర్త ఆనంద్ కూడా కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్నాడు. ఇషా చక్కగా పియానో వాయిస్తుంది. ‘వాట్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా ఈజ్ గుడ్ ఫర్ రిలయన్స్’ అంటుందామె. దేశం అభివృద్ధి చెందాలి, దాంతోపాటు రిలయన్స్ కూడా సంపదను సృష్టించుకోవాలి. అంతిమంగా సామాన్యుడి జీవితం మెరుగుపడాలి ఎంత మంచి ఆలోచన!