న్యూఢిల్లీ : దేశీ స్మార్ట్వాచ్ కంపెనీ ఫైర్బోల్ట్ భారత్ మార్కెట్లో తన పోర్ట్పోలియోను విస్తరించింది. ఫైర్బోల్ట్ ఇన్క్రెడిబుల్ పేరుతో భారీ అమోల్డ్ డిస్ప్లేతో న్యూ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. హార్ట్రేట్ మానిటర్, ఎస్పీఓ2 ట్రాకర్ వంటి పలు సెన్సర్లతో ఈ స్మార్ట్వాచ్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
మెడిటేటివ్ బ్రీతింగ్ ఫీచర్ను కూడా ఈ స్మార్ట్వాచ్లో కంపెనీ జోడించింది. ఇన్క్రెడిబుల్ మెరుగైన టచ్ రెస్పాన్స్తో, బ్రైటర్ అమోల్డ్ డిస్ప్లేతో, మల్టిపుల్ ఇన్బిల్ట్ గేమ్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని ఫైర్బోల్ట్ సహ వ్యవస్ధాపకులు ఆయుషి, ఆర్ణవ్ కిషోర్లు పేర్కొన్నారు.
రూ 3999కు అందుబాటులో ఉండే ఫైర్బోల్ట్ ఇన్క్రెడిబుల్ బ్లాక్, పింక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఫైర్బోల్ట్ అధికారిక వెబ్సైట్తో పాటు అమెజాన్ ఇండియా సైట్లో ఈ స్మార్ట్వాచ్ను కొనుగోలు చేయవచ్చు.