హైదరాబాద్ గండిపేట వద్దగల ఇబ్రహీం బాగ్లో ‘తారామతి నాట్యమందిరం’ ఎవరి పేరుతో, ఎవరి కాలంలో ఏర్పడింది?- 7వ సుల్తాన్"అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ప్రముఖ నర్తకి తారమతి పేరుతో...
తెలంగాణలో ఆదిమమానవుడు నడయాడిన ఆనవాళ్ళు కోకోల్లలు, అటువంటి వాటి తో నాటి చిత్రకళా
నైపుణ్యాన్ని తెలియజేసే ‘ఒంటిగుండు’ ప్రాంతం ఎక్కడ కలదు? – భద్రాద్రి కొత్తగూడెం
చిందు యక్షగాన పితామహుడు? – పిల్లుట్ల వెంకయ్య
‘మనఊరు- మన కూరగాయలు’ పథకం ఎప్పుడు ప్రారంభించారు? -2014, ఆగస్ట్ 6.
తెలంగాణ ‘రవివర్మ’ అని ఎవరిని అంటారు? – మార్చల రామారావు, కల్వకుర్తి వాసి
‘పికాసో ఆఫ్ ఇండియా’ అని పిలువదగిన చిత్రకారుడు ఎవరు? – పాకాల తిరుమల రెడ్డి (పీటీ రెడ్డి)
తెలంగాణలో ‘స్టీల్ బ్యాంక్’ ఎక్కడ ఉంది. – సిద్దిపేట
హైదరాబాద్లోని ‘జూబ్లిహాల్’ ఎవరు ఎప్పుడు నిర్మించారు?- 1913లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (పబ్లిక్గార్డెన్లో)
మూసీనది పక్కన గల ఎరుపు, తెలుపు రాళ్లతో నిర్మించిన ‘హైకోర్టు’ను డిజైన్ చేసిన ఇంజినీర్స్ ఎవరు? -1915లో జైపూర్కి చెందిన శంకర్లాల్, హైదరాబాద్కి చెందిన మెహర్ అలీ ఫజిల్
నిర్మల్ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది? – 400 సం.రాల క్రితం నిమ్మనాయుడు పరిపాలించడం వల్ల నిర్మల్ అని పేరు వచ్చింది.
ముసారాంబాగ్ ఆ పేరు వచ్చింది? – ఫ్రెంచి సైనిక అధికారి మూన్సే రేమాండ్- సమాధి ఉండడం వల్ల
రాష్ట్ర అటవీ అకాడమీ ఎక్కడ కలదు? – దూలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద ‘మీర్- అలమ్-ట్యాంక్’ ఎవరి పేరుతో, ఏ సంవత్సరంలో ఏర్పడింది? -1806లో అప్పటి ప్రధాని మీర్ ఆలం బహదూర్ పేరుతో
మలక్పేట ఎవరి పేరుతో ఏర్పడింది? అతను ఏదేశస్థుడు?- ‘తానిషా’ అంతరంగిక కార్యదర్శి పేరు ‘బడే మాలిక్’. ఇతను ఇథియోపియా నుండి వచ్చిన హబ్సీ తెగకు చెందినవాడు.
హైదరాబాద్లోని రవీంద్రభారతి ఎప్పుడు శంకుస్థాపన చేశారు. ఎవరు ప్రారంభోత్సవం చేశారు? -1960 మార్చి 23న శంకుస్థాపన చేశారు. 1961 మే 11న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభోత్సవం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మించిన తొలి ప్రాజెక్టు? – భక్త రామదాసు ప్రాజెక్టు కూసుమంచి (రిజర్వాయర్) వద్ద పాలేరు నదిపై
తెలంగాణ ప్రభుత్వం సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది? – టి. హరిష్రావు(మంత్రి)సిద్దిపేట మార్కెట్ యార్డ్లో 2014 అక్టోబర్ 13న
హైదరాబాద్ గండిపేట వద్దగల ఇబ్రహీం బాగ్లో ‘తారామతి నాట్యమందిరం’ ఎవరి పేరుతో, ఎవరి కాలంలో ఏర్పడింది?- 7వ సుల్తాన్”అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ప్రముఖ నర్తకి తారమతి పేరుతో
భారతదేశంలో సీబీటీసీ టెక్నాలజీతో ఏర్పడిన మొట్టమొదటి మెట్రో రైల్వే ఏది? – హైదారాబాద్ మెట్రో రైల్వే (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ -సీబీటీసీ)
హైదరబాద్ నగరంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? – మొత్తం 19 యూనివర్సిటీలు
మిషన్ భగీరథ ఎక్కడ, ఎవరు ప్రారంభించారు? – 2016 ఆగస్ట్ 7న గజ్వేల్ నియోజక వర్గంలోని కోమటి బండలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ‘తెలంగాణ చేను కబుర్లు’ కార్యక్రమాన్ని కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?- 2015 జనవరి 26న.
ఆసియాలోనే అతిపెద్ద జాతరను ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ పండుగగా గుర్తించింది. -1996లో
విశ్వనాధ సత్యనారాయణ గారికి సన్మానం చేయుటకు ఆహ్వనించగా, ఆయనతోనే సన్మానించుకున్న మునగాల ప్రాంత తెలంగాణ కవి ఎవరు? – శ్రీ చివులూరి లక్షి నర్సింహాచార్యులు
సమ్మక్క సారక్క జాతరలో కీలకమైన ఘట్టాలు ఏవి? -సమ్మక్క తల్లిరాక, పోలీస్ అధికారి గాలిలో కాల్పులు
షాజహాన్ ఆఫ్ హైదరాబాద్ అని ఎవరిని అంటారు? -6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దివాన్ ‘వికారుల్ ఉమ్రా’
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కేంద్రం హైదరాబాద్ నగరంలోని గౌలిగూడ. దీని అసలు పేరు – గొల్లగూడ
హైదరాబాద్లోని ఉప్పుగూడలోని ‘కందికల్’ గేట్ సమీపంలో 3 1/2 ఎకరాల విస్తీర్ణంలో గల చిత్రగుప్త ఆలయాన్ని బీహర్ నుండి వచ్చిన కాయస్థులు నిర్మించారు. దీన్ని వెలుగులోకి తెచ్చిందెవరు? – రాజా కిషన్ పర్షాద్
హైదరాబాద్లోని బిర్లామందిర్ ఏ సంవత్సరంలో నిర్మించారు. -1976లో
జూబ్లీహిల్స్ -మాదాపూర్ మధ్యలో ఉన్న దుర్గం చెరువును నిర్మించిన రాజులెఎవరు? -కుతుబ్షాహీలు
బైండ్లవారు ఎల్లమ్మ, పోచమ్మ, అక్కమ్మ, సారంగధర చరిత్రలను గానం చేయడానికి ఉపయోగించే వాయిద్యం ఏది? – బవనిక (జమిడిక)
తెలంగాణలో హుండీలేని దేవాలయం, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన దేవాలయం ఏది? -చిలుకూరు బాలాజీ దేవాలయం (హైదరాబాద్కు 25 కి.మీ.ల దూరంలో ఉంది)
తెలంగాణకు చెందిన ఏ కళాకారుని పుట్టిన రోజును మిమిక్రీ డే గా డిసెంబర్ 28న జరుపుకుంటారు? – నేరెళ్ళ వేణు మాధవ్, ఒన్ మ్యాన్ ఆర్కెస్ట్రా
తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ 5వ సమావేశం 2020, జనవరి 18,19 తేదీల్లో ఎక్కడ జరిగింది? -నడిగూడెంలోని నాయని వెంకట రంగారావుగారి కోటలో
ప్రపంచంలో రెండవ ఐలాండ్ మ్యూజియంగా పేరుగాంచిన నాగార్జునకొండకు శంఖుస్థాపన ఎప్పుడు, ఎవరు చేశారు? – 1959 జనవరి 31న అప్పటి కేంద్ర మంత్రి హుమాయున్ కబీర్
తెలంగాణాలో మొదటిసారిగా రాతి చిత్రాలను గుర్తించిన శాస్త్రవేత్తలెవరు? ఎక్కడ? – 1934లో
మహబూబ్నగర్ జిల్లాలోని సంగనోనిపల్లెలో లియోనార్డ్మన్, మహదేవన్లు
తెలంగాణలో పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు? – 1884
తెలంగాణ సినిమా పితామహుడు ధీరెన్ గంగూలీ (ధీరేంద్రనాథ గంగోపాధ్యాయ) ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? – 1893 మార్చి 23న బంగ్లాదేశ్లో జన్మించారు.
తెలంగాణలో గల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చిని ఎవరు నిర్మించారు. – చార్లెస్ వాకర్ ఫాస్ఫీట్ అనే ఇంజనీర్
1890లో హైదరాబాద్లో పర్షియన్ అరబిక్ తాళపత్ర గ్రంథాల ముద్రణ కోసం దైరతుల్ మారిఫ్ అనే సంస్థను స్థాపించినదెవరు? -అబ్దుల్ ఖయూమ్
శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం అనే గ్రంథాలయానికి తెలంగాణలోని ఏ జమిందారు 40 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేశారు? -మునగాల రాజా నాయని వెంకట రంగారావు
గాంధీజీ హైదరాబాద్ ప్రథమ పర్యటనలో మహిళ సభను ఎక్కడ ఏర్పాటు చేశారు? – ప్రేమ్ థియేటర్లో
కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు వేయిస్తంభాలగుడి వంటి గుడులను తెలంగాణలో ఎక్కడెక్కడ నిర్మించాడు? -కొలనుపాక, మంథని
శ్రీ పర్వతంపై నిలువెత్తు బంగారు విగ్రహాలున్నాయని రాసిన చైనా యాత్రికుడెవరు? -హుయాన్త్సాంగ్
గోల్కొండ రాజ్యంలోని ‘కోలార్’ వజ్రపు గనులను సందర్శించిన ఆంగ్లేయుడెవరు? – విలియం మైథోల్డ్
ఉత్తర సర్కార్లు కావాలని 1788లో మీర్ ఆలం అనే దూతను గవర్నర్ జనరల్ ‘కారన్ వాలీస్’ వద్దకు పంపిన నిజాం రాజెవరు? – 2వ నిజాం – నిజాం ఆలీఖాన్
కుతుబ్షాహీల విపులమైన చరిత్ర ‘తారిఖే కుతుబ్షాహి’ని రచించిన కవి ఎవరు? -ఖోర్షాహఖ బాదుల్ హుస్సేనీ
ప్రపంచంలో ఉర్దూభాష పుట్టింది. హైదరాబాద్లో దానికి ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? – మీర్జా సిరాజుద్దీన్ ఖాన్ అర్జూ ఢిల్లీ (1689-1765)
ఉస్మానియా విశ్వవిద్యాలయ జనకుడు అనిచెప్పే నిజాం రాజు కార్యదర్శి ఎవరు? – సర్ అక్బర్ హైదరీ
చారిత్రాత్మక ‘రాచకొండ’ గిరి దుర్గాన్ని నిర్మించిన రాజు ఎవరు? – అనపోతనీడు (మొదటి సింగమ నాయకుని కుమారుడు)
1971లో తెలంగాణ వ్యక్తికే సీఎం పదవి ఇవ్వాలన్న అప్పటి మంత్రి ఎవరు? – అక్కిరాజు వాసుదేవరావు
కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ ఎర్రకోట అని ఏ కోటను అంటారు. – రాజాపేట కోట (యాదాద్రి భువనగిరి జిల్లా)
తెలంగాణలో జైన మతస్థుల ధాన్యాగారం ఏది? -గొల్లత్తగుడి జైన కేంద్రం మహబూబ్నగర్ జిల్లా
‘కొమరం భీం’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తీసుకున్న తెలంగాణ వ్యక్తి ఎవరు? – అల్లాణి శ్రీధర్, కొడకంబ, మెదక్జిల్లా
హైదరాబాద్లో మహ్మద్ ఇక్బాల్ అనే ప్రముఖ జాతీయ కవి స్థూపం ఎక్కడ ఉంది? – సైఫాబాద్, హైదరాబాద్
బాల నాగమ్మ, మాయల మరాటీ, జానపదగాథలు తెలంగాణలో ఏ ప్రాంతానికి చెందినవి? – పానగల్లు, నల్లగొండ
చారిత్రక తారామతి మందిరం నిర్మాత ఎవరు? ఎక్కడ ఉంది? -అబ్దుల్లా కుతుబ్ షా గండిపేట దగ్గర ఇబ్రహీం బాగ్లో ఉంది.
కాకతీయుల చరిత్రలో యుగంధరుడు అన్న బిరుదున్న సేనాపతి ఎవరు? -నాగయ గన్నయ ఇతనికి మరోపేరు మాలిక్ మక్బూల్ – రుద్రమదేవి, 2వ ప్రతాపరుద్రుని కాలంలో పనిచేశాడు.
తెలంగాణకు చెందిన ఒక సాధారణ ‘డోలు’ వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డ్ అందు కున్నారు. ఆయన ఎవరు? – సకిని రామచంద్రయ్య, మణుగూరు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏ గ్రామ పంచాయతీ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంది? – సిద్దాపుర్ (గ్రామం), నందిపేట మండలం, నిజామాబాద్ జిల్లా.
ఇటీవల జనగాం జిల్లాలో రాతియుగం నాటి ఆనవాళ్ళు బయల్పడిన గ్రామం ఏది? – గోవర్ధనగిరి
ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధపోరాటంలో తుపాకి పట్టిన కమ్యూనిస్ట్ యోధురాలు ఎవరు? – మల్లు స్వరాజ్యం
ఇటీవల భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన తెలంగాణ వాసి ఎవరు? – కెతావత్ సోమ్లాల్, ఆకుతోటబావి గ్రామం, నల్లగొండ జిల్లా
ప్రపంచంలోనే మొట్టమొదటి మత్తుమందు డాక్టర్ మన తెలంగాణ ముద్దు బిడ్డే? – రూపాబాయి, ఫర్దూనీ- హైదరాబాద్
గొప్ప సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు గురువైన సంగీత దర్శకుడు? – జి.కె. వెంకటేష్ హైదరాబాద్, తెలంగాణ
హైదరాబాద్లోని మొజాంజాహీ మార్కెట్ను ఏ సంవత్సరంలో ఎవరి పేరుతో నిర్మించారు? -1935లో మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (7వ నిజాం) మొదటి కుమారుడు మొజాంజాహీ పేరుతో
మాభూమి’ కన్నా ముందే మృణాళ్ సేన్ నిర్మించిన ‘ఒక ఊరి కథ’ అనే సినిమాను ఏ ఊరిలో చిత్రీకరించారు.- రంగారెడ్డి జిల్లాలోని చీదేడ్ గ్రామం
తెలంగాణ ముద్దుబిడ్డ పాతతరం సినిమా, నాటకరంగం నటుడు‘భానుప్రకాష్’ ఎక్కడ జన్మించాడు. – నల్లగొండలో 1939 ఏప్రిల్ 11న
దక్కన్ ఆయుర్వేద వైద్యమండలిని హైదరాబాద్లో స్థాపించిందెవరు? -వేదుల తిరుమల వెంకట రామానుజ శతావధాని
ఛత్రపతి శివాజీ 1677లో దర్శించిన తెలంగాణలోని దేవాలయం ఏది? -మహేశ్వరం (హైదరాబాద్ దగ్గర శ్రీశైలం రోడ్డు)
సికింద్రాబాద్లోని బొల్చారం చర్చిని హోలీ ట్రినిటీ చర్చి అనికూడా అంటారు. దీనిని నిర్మించినదెవరు?- 1847లో విక్టోరియా మహారాణి
1948లో హైదరాబాద్లోని వెటర్నరీ సైన్స్ కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్ ఎవరు? – డా.ఎం. హబీబ్ఖాన్
దక్షిణ భారతదేశ చరిత్రలో దేవాదాయ ధర్శాదాయ భూములపై పన్ను విధించిన మంత్రి ఎవరు? – మాదన్న (అబుల్ హసన్ తానీషా మంత్రి)
హైదరాబాద్కు చెందిన చంద్రకాంత ప్రెస్ను గౌలిగూడలో ఎవరు స్థాపించారు? – కృష్ణస్వామి ముదిరాజ్
జయదేవుని గీత గోవిందాన్ని తెలుగులోకి అనువదించిన గద్వాల పెదసోమభూపాలుని ఆస్థాన విద్వాంసుడెవరు? – కామ సముద్రం అప్పలాచార్యుడు