చెన్నై: ఫుట్బాల్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం జీ గ్రూప్ కైవసం చేసుకుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ నెల 11 నుంచి జూలై 19 వరకు జరగనుండగా, సుమారు రూ. 320 కోట్ల (35 మిలియన్ డాలర్లు) భారీ మొత్తంతో ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభం కానుండటంతో సోనీ, జియోస్టార్ వంటి సంస్థలు వెనక్కి తగ్గగా, జీ గ్రూప్ రంగంలోకి దిగి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్ను జీ గ్రూప్ తమ నాలుగు కొత్త స్పోర్ట్స్ చానెళ్లతో పాటు జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.