Rishabh Pant | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్టార్ వికెట్, కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ జట్టు ఆకాంక్షించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా జట్టులోని ఇతర ఆటగాళ్లు శ్రీలంకతో సిరీస్కు ముందు పంత్కు సందేశాలు పంపారు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసింది.
కోచ్ రాహుల్తో పాటు జట్టు సభ్యులు పంత్ను ఫైటర్గా అభివర్ణించారు. ‘నువ్వు ఛాంపియన్వి, త్వరగా కోలుకుంటావు’ అని తెలిపారు. గత శుక్రవారం రూర్కీలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోకాకి ఫ్రాక్చర్ కాగా.. నుదుటిపై కుట్లపడ్డాయి. చేతికి, వీపుకి గాయాలయ్యాయి. ఈ క్రమంలో కొద్దికాలం పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. పంత్ పూర్తిగా కోలుకునేందుకు దాదాపు ఆరు నెలల పాటు సమయం పడుతుందని భావిస్తున్నారు.
బీసీసీఐ విడుదల చేసిన వీడియో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘రిషబ్ క్షేమంగా ఉన్నావని, త్వరగా కోలుకుంటావని ఆశిస్తున్నాను. గత ఏడాది కాలంలో మనం కలిసిపని చేసే అవకాశం వచ్చింది. భారత టెస్టు చరిత్రలో క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో మరపురాని ఇన్సింగ్స్ను ఆడావు. వాటి నుంచి ఎలా బయటపడాలో నీకు తెలుసని నాకు తెలుసు. ఇది ఓ సవాల్, నువ్వు తిరిగి వస్తావు’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడం టీమ్ ఇండియాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా పెద్ద దెబ్బ తగిలింది. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు పంత్ దూరం కానున్నాడు. దాంతో పాటు ఐపీఎల్ 16వ సీజన్కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఐదు నెలల్లోగా పంత్ కోలుకోకపోతే.. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమ్ ఇండియా ఫైనల్కు చేరుకుంటే.. జూన్లో జరిగే టైటిల్ మ్యాచ్కు దూరమయ్యే చాన్స్ ఉంది.
💬 💬 You are a fighter. Get well soon 🤗 #TeamIndia wish @RishabhPant17 a speedy recovery 👍 👍 pic.twitter.com/oVgp7TliUY
— BCCI (@BCCI) January 3, 2023