గ్వాలియర్: యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైన పోరులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాప్ ఇండియా 3 వికెట్లకు 381 పరుగులు చేసింది.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (2) విఫలం కాగా.. యశస్వితో పాటు sఈశ్వరన్ (240 బంతుల్లో 154; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 371 పరుగులు జోడించడం విశేషం. మధ్యప్రదేశ్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌరభ్ కుమార్ (0), ఇంద్రజిత్ (3) క్రీజులో ఉన్నారు.