బెంగళూరు: యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (372 బంతుల్లో 181; 23 ఫోర్లు, ఒక సిక్సర్) హ్యాట్రిక్ సెంచరీతో చెలరేగడంతో ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై భారీ విజయంపై కన్నేసింది. దేశవాళీ ట్రోఫీలో రికార్డు స్థాయిలో 41 సార్లు విజేతగా నిలిచిన రంజీ రారాజు ముంబై..
శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 449 పరుగులు చేసింది. యశస్వితో పాటు అర్మాన్ జాఫర్ (127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతొక్కొట్టాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 393 పరుగులు చేయగా.. ఉత్తర ప్రదేశ్ 180 పరుగులకే ఆలౌటైంది. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 6 వికెట్లు ఉన్న ముంబై ప్రస్తుతం 662 పరుగుల ఆధిక్యంలో ఉంది.