IND vs AUS : రాయ్చూర్లో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ స్వల్ప వ్యవధిలో మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. అగా సంగా వేసిన 8వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(1), శ్రేయస్ అయ్యర్(8) ఔటయ్యారు. అంతకుముందు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(37 : 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) హర్డీ బౌలింగ్లో యశస్వీ భారీ షాట్ ఆడి మెక్డెర్మాట్కు క్యాచ్ ఇచ్చాడు . దాంతో, 50 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్(11), రింకూ సింగ్ (1) క్రీజులో ఉన్నారు. 8.3 ఓవర్లకు స్కోర్.. 64/3
సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ బౌలింగ్ తీసుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఐదు మార్పులతో బరిలోకి దిగుతోంది. మార్కస్ స్టోయినిస్, మాక్స్వెల్, ఇంగ్లిస్, రిచర్డ్సన్, ఎల్లిస్ స్థానంలో కొత్తవాళ్లకు చాన్స్ ఇచ్చారు. ఇక భారత జట్టు ప్రసిధ్ స్థానంలో ముకేశ్, అర్ష్దీప్ స్థానంల్ దీపక్ చాహర్, తిలక్ వర్మ ప్లేస్లో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బదులు జితేశ్ శర్మను ఆడిస్తోంది.