Wrestlers Protest | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజర్లు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం స్పందించారు. ఓ విలేకరుల సమావేశంలో గంగూలీ మాట్లాడుతూ ఏం జరుగుతుందో తనకు పూర్తిగా తెలియదని, సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వారిని తమ యుద్ధంలో పోరాడనివ్వండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను పేపర్లలో మాత్రం చదివాను. క్రీడా ప్రపంచంలో పూర్తిగా అవగాహన లేని విషయాలపై మాట్లాడకపోవడమే మంచిదని తాను గ్రహించాను’ అని గంగూలీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా రెజ్లర్లు నిరసనలను తెలుపుతున్నారు. గత నెల 23 నుంచి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. రెజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదయ్యాయి. మరో వైపు రెజర్ల ఆరోపణలపై భారత ఒలింపిక్ సంఘం విచారణ కొనసాగుతున్నది. మూడు నెలల కిందటే రెజర్లు ఆందోళన చేపట్టగా.. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంతో ఆందోళన విరమించారు. మూడు నెలలు గడిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బహిర్గతం కాకపోవడంతో విసిగిపోయిన రెజర్లు మళ్లీ ఆందోళన చేపట్టారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకునే వారకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
VIDEO | "Let them fight their battle. I don't know what's happening there, I just read in the newspapers. In the sports world, I realised one thing that you don't talk about things you don't have complete knowledge of," says @SGanguly99 on wrestlers' protest. pic.twitter.com/NjsaipIkyr
— Press Trust of India (@PTI_News) May 5, 2023