జోగుళాంబ గద్వాల : బైక్ అదుపు తప్పి(Road accident) ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాదకర సంఘటన జోగుళాంబ గద్వాల(Gadwala) జిల్లా ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధి అలంపూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఏపీలోని నంద్యాల జిల్లా, బనగానపల్లె గ్రామానికి చెందిన కొంతమంది యువకులు హైదరాబాద్ హయత్నగర్లో నిన్న రాత్రి జరిగిన వివాహానికి హాజరయ్యారు.
కార్యక్రమం అనంతరం హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు బైకులపై తిరిగి వెళుతుండగా అలంపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు కలిసే లోకేషన్లో బైకు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఖాసీం (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ పై వెనుక కూర్చున్న సమీర్ సైఫ్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని అంబులెన్స్లో కర్నూల్లోని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.