WPL 2024 : మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024) రెండో సీజన్కు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ పోటీలు జరుగనున్నాయి. అయితే.. తొలి సీజన్లో ముంబైకి మాత్రమే పరిమితమైన ఈ టోర్నీని ఈసారి మిగతా నగరాల్లో కూడా నిర్వహించనున్నారట. బెంగళూరులో కొన్ని మ్యాచ్లు ఆడిస్తారని సమాచారం. అయితే.. వేదికలపై బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది.
డబ్ల్యూపీఎల్ 2023ను ముంబైలోని డీవై పాటిల్(DY Patil), బ్రబౌర్నే(Brabourne) స్టేడియాల్లో నిర్వహించారు. గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి.
డబ్ల్యూపీఎల్ ట్రోఫీతో హర్మన్ప్రీత్ కౌర్, ముంబై జట్టు
టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఢిల్లీ, ముంబై టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) నేపథ్యంలోని ముంబై.. మేగ్ లానింగ్(Meg Lanning) బృందాన్ని 7 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా అవతరించింది.
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ కోసం ఐదు ఫ్రాంచైజీలు 60 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. పేలవ ఫామ్తో నిరాశపరిచిన 29 మందిని విడుదుల చేశాయి. గుజరాత్ ఫ్రాంచైజీ అయితే ఏకంగా 12 మందిని వదిలించుకుంది. త్వరలోనే అన్ని జట్లు మినీ వేలం పాల్గోననున్నాయి. అయితే.. రెండో సీజన్ కంటే ముందే భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సిరీస్లు ఆడనుంది.