Pakistan Cricket Board : పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq) రాజీనామాకు గురువారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) ఆమోదం తెలిపింది. త్వరలోనే కొత్త సెలెక్టర్ను నియమించనున్నట్టు జకా అష్రఫ్ నేతృత్వంలోని పీసీబీ వెల్లడించింది. వరల్డ్ కప్లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనకు తోడూ.. జట్టు ఎంపికలో అవినీతి ఆరోపణలు రావడంతో ఇంజమామ్ అక్టోబర్ 30న రిజైన్ చేసిన విషయం తెలిసిందే.
పాక్ సీనియర్, జూనియర్ పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీకి చైర్ పర్సన్గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ ఇంజమామ్.. వరల్డ్ కప్ కోఎసం 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశాడు. అయితే.. వరల్డ్ కప్లో బాబర్ సేన వరుస పరాజయాలతో నిరాశపరిచడంతో స్వదేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఇస్లామాబాద్ వేదికగా నడిచే ‘యజో ఇంటర్నేషనల్ లిమిటెడ్’ ప్లేయర్స్ ఏజెన్సీలో ఇంజమామ్కు పెట్టుబడులు ఉన్నాయి.
PCB accepts Inzamam-ul-Haq’s resignation
Details here ⤵️ https://t.co/ssGEqfksgM
— PCB Media (@TheRealPCBMedia) November 8, 2023
ప్రస్తుతం పాక్ టీమ్లో ఉన్న బాబర్ ఆజమ్, పేసర్ షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్తో పాటు మరికొందరికి ఈ సంస్థతో అనుబంధం ఉంది. దాంతో, ఇంజమామ్కు అనుకూలంగా ఉండే ఆటగాళ్లనే వరల్డ్ కప్ పోటీలకు ఎంపిక చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజమామ్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే అతడిపై తీవ్ర చర్యలుంటాయని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. ఒకవైళ తాను నిర్దోషిగా తేలితే మళ్లీ చీఫ్ సెలెక్షన్ కమిటీ చైర్ పర్సన్గా బాధ్యతలు చేపడతానని ఇంజీ ప్రకటించాడు.
వన్డే వరల్డ్ కప్లో బాబర్ ఆజాం నేతృత్వంలోని పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో సెమీస్ రేసులో వెనకబడింది. వరుస ఓటములతో డీలా పడిన పాక్.. 2019 రన్నరప్ న్యూజిలాండ్పై అద్భుత విజయంతో పోటీలో నిలిచింది. ఇంగ్లండ్తో నవంబర్ 11న జరిగే మ్యాచ్ బాబర్ సేనకు చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్లో గెలిస్తే దాయాది జట్టుకు సెమీస్ బెర్తు దక్కే అవకాశం ఉంది.