మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచ కప్లో (Women’s World Cup) భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్కు దిగింది. నాకౌట్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బ్యాటర్ యస్తికా భటియాను వికెట్ కోల్పోయింది. 11 బాల్స్లో 8 పరుగులు చేసిన యస్తియా.. జట్టు స్కోరు 18 రన్స్ వద్ద శ్రుబ్సోలే బౌలింగ్లో మొదటి వికెట్గా వెనుతిరింది.
తరువాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఎక్కువసేపు నిలువలేకపోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మిథాలీ.. ఐదో ఓవర్లో క్యాచౌట్ అయింది. దీంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం స్మృతి మంధాన (21 బంతుల్లో 16 రన్స్), దీప్తి శర్మ క్రీజ్లో ఉన్నారు.