ఆక్లాండ్: మహిళల ప్రపంచకప్లో (Women’s World Cup) భాగంగా భారత్ తన ఐదో మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతున్నది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండింట ఓడిన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్లో టీమ్ఇండియా తప్పక గెలవాల్సింది. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇంగ్లండ్తో జరిగిన గత మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా.. బ్యాటింగ్ వైఫల్యంతో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
భారత బ్యాటింగ్ భారాన్ని స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక్కతే మోస్తున్నది. స్మృతితోపాటు హర్మన్ప్రీత్ కౌర్ శ్రీలంకతో మ్యాచ్లో సెంచరీ చేసింది. మరి ఆసిస్తో మ్యాచ్ వీరిద్దరు ఎలా ఆడతారో చూడాల్సిందే. ఇక తన చివరి వరల్డ్ కప్ ఆడుతున్న కెప్టెన్ మిథాలీ రాజ్ ఇప్పటివరకు తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు.