దుబాయ్: భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్లో మొత్తం మ్యాచ్లు జరుగాల్సి ఉన్నా..పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొలంబోలో పాక్ మ్యాచ్లకు ఏర్పాట్లు చేశారు. బెంగళూరు, గువాహటి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో వేదికలుగా వరల్డ్కప్ మ్యాచ్లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్, బంగ్లా పోరుతో ప్రపంచకప్ టోర్నీకి తెరలేవనుంది. తొలి సెమీస్ గువాహటి లేదా కొలంబోలో అక్టోబర్ 29న జరుగునండగా, రెండో సెమీస్కు అక్టోబర్ 30న బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. 12 ఏండ్ల తర్వాత ఆతిథ్యమిస్తున్న భారత్ టైటిల్ ఫెవరేట్గా బరిలోకి దిగుతున్నది.
మెగా టోర్నీకి చికున్ గున్యా అడ్డంకి
దుబాయ్: ఈనెల 6 నుంచి శ్రీలంకలో జరగాల్సి ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ వాయిదా పడింది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులతో పాటు స్థానికంగా చికున్ గున్యా పంజా విసురుతున్నది. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో ఈ టోర్నీని వాయిదా వేయాలని లంక కోరగా అందుకు ఏసీసీ అంగీకరించింది.