Sania Mirza : టీ 20 ప్రపంచకప్ ( T20 world cup ) పోటీలు ఇవ్వాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న దాయాదుల పోరు త్వరలో మన ముందుకు రానున్నది. ఎప్పుడెప్పుడు దాయాదుల మధ్య పోరు ( india vs pakistan ) జరుగుతుందో..? ఎవరు పైచేయి సాధిస్తారో..? అని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కి మాత్రం తలనొప్పి తప్పేట్లు లేదు. అటు అమ్మగారిళ్లు, ఇటు అత్తగారిళ్లు మధ్య నలిగిపోతున్నది. దాంతో సానియా మీర్జా ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే..?
టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో ఒకే విభాగంలో దాయాది దేశాలైన భారతదేశం, పాకిస్తాన్ ఉన్నాయి. టీమిండియా తొలి మ్యాచ్ ఈ నెల 24 న పాకిస్తాన్తో జరగనున్నది. ఈ మ్యాచ్ ( india vs pakistan ) కోసం ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తుండగా.. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాత్రం.. ఆ రోజున సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నది. మ్యాచ్ సమయంలో చెడు వాతావరణాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశం-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు, సానియాను రెండు దేశాల ప్రేక్షకులు తీవ్రంగా ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే ఆమె భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ తరఫున ఆడతుండగా.. సానియా మీర్జా భారతదేశానికి చెందిన క్రీడాకారిణి.
సోషల్ మీడియాలో రెండు దేశాల నెటిజెన్ల ట్రోల్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాలో కనిపించకుండా పోవాలని సానియా మీర్జా నిర్ణయించుకున్నది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక గమ్మత్తైన వీడియోను పోస్ట్ చేసింది. ‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రోజున విషపూరిత వాతావరణం నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నాను. బై బై’ అని వీడియోపై కాప్షన్గా రాసింది.
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకున్నది. యూనిస్ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు 2009 ప్రపంచ కప్ గెలిచింది. షోయబ్ మాలిక్ ఆ బృందంలో సభ్యుడు. షోయబ్ 2007 లో తొలిసారి ఆడిన టీ 20 ప్రపంచకప్ ( T20 world cup )లో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 2007 వరల్డ్ కప్లో భారత్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. షోయబ్ ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ 20 ప్రపంచకప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టులో సభ్యుడుగా ఉండటం విశేషం. పాకిస్థాన్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్లలో భారత్ను ఓడించలేకపోయింది. టీ 20 ప్రపంచకప్ పోటీల్లో భారత్-పాకిస్తాన్ మధ్య 5 మ్యాచ్లు జరగ్గా.. ఇందులో టీమిండియా 4-0తో ఆధిక్యంలో ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మీరు లొడలొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోసమే ఈ యాప్స్
ఒకప్పుడు భిక్షాటన ఆ ఊళ్లో కులవృత్తి.. కానీ ఆ ఒక్క నిర్ణయంతో..
ఈ ఐదు రకాల వ్యక్తులను అస్సలు పెండ్లి చేసుకోవద్దు..!
హైదరాబాద్ బిర్యానీ బోర్ కొట్టిందా? ఈ వెరైటీ బిర్యానీలను ట్రై చేయండి
ఉన్నట్టుండి సూర్యుడు మాయమైపోతే ఎలా? భూమిపై మనుషులు ఏమవుతారు?