నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబెట్టారు. కానీ ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో వీళ్లిద్దరూ పెవిలియన్ చేరారు.
దినేష్ కార్తీక్ (6) విఫలమవగా.. సంజూ శాంసన్ (30 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అక్షర్ పటేల్ (8 బంతుల్లో 20 నాటౌట్) ధనాధన్ ఆటతో ఆకట్టుకున్నాడు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో ఓబెడ్ మెకాయ్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. అకీల్ హొస్సేన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
.@RishabhPant17 top-scored for #TeamIndia and was our top performer from the first innings of the 4th #WIvIND T20I. 👌 👌
A summary of his knock 🔽 pic.twitter.com/0GjTI3TRyx
— BCCI (@BCCI) August 6, 2022