పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు నిదానంగా ఇన్నింగ్స్ నిర్మిస్తోంది. ఆరంభంలోనే కైల్ మేయర్స్ (39), షాయి హోప్ (71 నాటౌట్) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా మేయర్స్ భారీ షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
మేయర్స్ అవుటైన తర్వాత వచ్చిన బ్రూక్స్ (35) కూడా ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన కింగ్ (0) విఫలమైనప్పటికీ.. నికోలస్ పూరన్ (11 నాటౌట్)తో కలిసి హోప్ మంచి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే విండీస్ జట్టు 30 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులతో నిలిచింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, చాహల్, దీపక్ హుడా తలో వికెట్ తీసుకున్నారు.