భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ మరో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 47వ ఓవర్లో రోవ్మెన్ పావెల్ (13) పెవిలియన్ చేరాడు. ఠాకూర్ వేసిన లెంగ్త్ బాల్ను పావెల్ బలంగా డ్రైవ్ చేశాడు.
వేగంగా వచ్చిన బంతిని శ్రేయాస్ అయ్యర్ చక్కగా అందుకోవడంతో పావెల్ పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ జట్టు 280 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. పావెల్ అవుటవడంతో షెఫర్డ్ క్రీజులోకి వచ్చాడు.