వెస్టిండీస్, భారత్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ వెల్లడించింది. టీమ్ కిట్స్ రావడం ఆలస్యం కావడంతో రెండో టీ20 మ్యాచ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్.. రాత్రి 11 గంటలకు మొదలైంది.
ఈ మ్యాచ్ ఆలస్యం అయిన కారణంగా మూడో టీ20ని కూడా ఆలస్యంగా ప్రారంభించాలని జట్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘‘సోమవారం నాడు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయిన నేపథ్యంలో.. ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభించాలనే ఆలోచనతో మూడో టీ20ని కూడా ఆలస్యంగా ఆరంభించేందుకు జట్లు నిర్ణయించాయి’’ అని వెస్టిండీస్ క్రికెట్ ప్రకటించింది. మూడో టీ20 రాత్రి 8 గంటలకు కాకుండా.. రాత్రి 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది.