వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. దగ్గరలో భయంకరంగా ఉరుములు ఉరమడంతో కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (15) నిరాశ పరిచాడు. ఒడియన్ స్మిత్ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ ఫీల్డర్ వెనకగా బౌండరీ పంపేందుకు శాంసన్ ప్రయత్నించాడు. కానీ టైమింగ్ మిస్ అవడంతో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దీంతో 142 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ ఉన్నారు.