వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (18) నాటౌట్ శుభారంభం అందించారు. అయితే అకీల్ హొస్సేన్ వేసిన ఐదో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన రోహిత్.. మరుసటి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో అతని బ్యాట్ను తప్పించుకున్న బంతి నేరుగా వికెట్లను కూల్చింది. ఈ క్రమంలో 53 పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (24) కూడా అవుటయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికే భారీ సిక్సర్ బాదిన సూర్య.. ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి అతని ప్యాడ్లకు తగిలింది. ఎల్బీడబ్ల్యూకు విండీస్ అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. సూర్యకుమార్ రివ్యూ కోరాడు. రివ్యూలో కూడా బంతి వికెట్లను తాకుతుందనే తేలడంతో సూర్య నిరాశగా మైదానం వీడాడు. అతను అవుటవడంతో రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులతో నిలిచింది.