తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64) అవుటయ్యాడు. ఒక పక్క వికెట్లు టపటపా కూలుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. హోల్డర్ వేసిన 15వ ఓవర్లో భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు.
ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని సిక్సర్ బాదేందుకు రోహిత్ ప్రయత్నించగా.. లాంగాఫ్లో ఉన్న హెట్మెయర్ దాన్ని సులభంగా అందుకున్నాడు. దాంతో రోహిత్ వెనుతిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి ఓవర్లోనే ఆఫ్స్టంప్ ఆవలగా అల్జారీ జోసెఫ్ వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించిన జడేజా (16) కూడా.. కీమో పాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులతో నిలిచింది.