వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (24), శ్రేయాస్ అయ్యర్ (0) ఇద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (14) ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన అతను.. పదో ఓవర్లో ఒకసారి అవటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. ఆ బంతి ఫోర్ వెళ్లింది.
ఆ మరుసటి బంతికే బౌండరీ బాదిన పంత్.. తర్వాతి బంతికే అవుటయ్యాడు. కీమో పాల్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ను డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన పంత్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని హొస్సేన్ అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. దాంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. పంత్ అవుటవడంతో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.