వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ శిఖర్ ధావన్ (28 నాటౌట్) నిదానంగా ఆడుతుంటే.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (41 నాటౌట్) తనదైన స్టైల్లో చెలరేగుతున్నాడు. వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడుతుండటంతో.. వికెట్లు తీయలేక, పరుగులు కట్టడి చెయ్యలేక వెస్టిండీస్ బౌలర్లు తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 73 పరుగులు చేసింది.