విండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటింగ్ ముగిసింది. సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (11) నిరాశ పరచగా.. ఓపెనర్గా కొత్త రోల్లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ (64) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా (38) కూడా ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత ఉరుముల వల్ల మ్యాచ్ మధ్యలో కొంత అంతరాయం కలిగింది.
ఆటగాళ్లు మైదానంలోకి తిరిగొచ్చిన కాసేపటికే సంజూ శాంసన్ (15) అవుటయ్యాడు. దినేష్ కార్తీక్ (12) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. చివరి ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హార్దిక్ పాండ్యా (28), అక్షర్ పటేల్ (9) అవుటయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లతో చెలరేగగా.. హోల్డర్, డ్రేక్స్, వాల్ష్ తలో వికెట్ తీసుకున్నారు.
.@ShreyasIyer15 scored a superb 6️⃣4⃣ & was our top performer from the first innings of the fifth #WIvIND T20I. 👌👌
A summary of his knock 💪#TeamIndia pic.twitter.com/19hPbygwfS
— BCCI (@BCCI) August 7, 2022