విండీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న శుభ్మన్ గిల్ (64) రనౌట్ అయ్యాడు. జోసెఫ్ వేసిన బంతిని లెగ్ సైడ్ కొట్టి సింగిల్ కోసం వచ్చిన గిల్.. పరుగు వచ్చేస్తుందనే ధీమాతో నెమ్మదిగా రన్ ప్రారంభించాడు.
అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ సారధి పూరన్ వేగంగా బంతి అందుకున్నాడు. అది చూసి గిల్ వేగం పెంచినప్పటికీ.. పూరన్ డైరెక్ట్ హిట్తో వెనుతిరగాల్సి వచ్చింది. దీంతో 119 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం విడిపోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ధావన్ (51 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.