టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్కు గడ్డుకాలం నడుస్తోంది. ఇంగ్లండ్లో షార్ట్ బాల్కు తలొగ్గిన అయ్యర్.. వెస్టిండీస్లో కూడా తనకు వచ్చిన అవకాశాలను క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. తాజాగా మూడో టీ20లో ఒకపక్క సూర్యకుమార్ అదరగొడుతుంటే అతనికి సహకారం ఇవ్వడంలో కూడా విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్లో 27 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. హొస్సేన్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మాజీ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ కఠినమైన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టీ20లో ఫామ్లో ఉన్న దీపక్ హుడాను మూడో స్థానంలో దింపాలని, రవీంద్ర జడేజా కోలుకుంటే శ్రేయాస్ను తొలగించి జడ్డూను ఆడించాలని సూచించాడు.
తనకు దక్కిన బంగారంలాంటి అవకాశాలను అయ్యర్ వృథా చేసుకుంటున్నాడని విమర్శించాడు. అలాగే స్ట్రగుల్ అవుతున్న ఆవేష్ ఖాన్ స్థానంలో ఫిట్గా ఉంటే హర్షల్ పటేల్ను తీసుకోవాలని సూచించాడు. మరి శనివారం జరిగే నాలుగో టీ20లో భారత జట్టు ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.
Shreyas Iyer's misery ends, never looked in touch..
Is it time for Sanju Samson in T20Is?#INDvsWI #WIvIND #SuryakumarYadav #RohitSharma #Iyerpic.twitter.com/Qqpc2hteF3— OneCricket (@OneCricketApp) August 2, 2022