వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ను చిత్తు చేసి టైటిల్ నెగ్గిన నొవాక్ జకోవిక్.. ప్రపంచ ర్యాంకింగ్స్లో మాత్రం నాలుగు స్థానాలు పడిపోయాడు. ఈ మ్యాచ్ ముందు మూడో స్థానంలో ఉన్న జకో.. టైటిల్ నెగ్గిన తర్వాత ఏడో ర్యాంకుకు పడిపోయాడు. దీనికి కారణం ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) నిర్ణయమే.
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను కారణంగా చూపిన వింబుల్డన్ నిర్వాహకులు.. తమ టోర్నమెంట్లో రష్యా, బెలారస్ ఆటగాళ్లను నిషేధించారు. దీంతో ఈ టోర్నీలో ర్యాంకింగ్ పాయిట్లు ఇవ్వకూడదని ఏటీపీ నిర్ణయించింది. ఈ కారణంగా జకోవిక్ దాదాపు 2వేల పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్ ఆటగాళ్లలో అత్యధిక పాయింట్లు కోల్పోయింది జకోనే కావడం గమనార్హం.