బర్మింగ్ హామ్ : ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్కు చేరుకోగా, పీవీ సింధు తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది.
శ్రీకాంత్ ఫ్రాన్స్కు చెందిన టొమొ జూనియర్ పొపొవ్పై 19-21, 21-14, 21-5తో గెలుపొందగా, సింధు 17-21, 11-21తో చైనాకు చెందిన జాంగ్ ఇ మన్ చేతిలో ఓడిపోయింది. ఈ యేడాది తొలి రౌండ్లోనే సింధు ఓడిన మూడో టోర్నీ ఇది. అంతకుముందు మహిళల డబుల్స్లో భారత జోడి గాయత్రి గోపీచంద్-త్రిసా జాలి 21-18, 21-14తో థాయ్ జోడీ జొంకోల్ఫన్ రవిందపై గెలిచింది.