ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్యాంకులను మెరుగుపరుచుకోగా.. ఇటీవలే బౌలర్లలో అగ్రస్థానానికి చేరిన బుమ్రా తిరిగి రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
ఇంగ్లండ్ తో మూడో వన్డే లో పాండ్యా ఆల్ రౌండ్ షో తో అదరగొట్టగా రిషభ్ పంత్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఈ ఇద్దరూ ర్యాంకులలో మెరుగయ్యారు. బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకులలో.. రిషభ్ పంత్ 25 స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరాడు. పాండ్యా.. 8 స్థానాలు ఎగబాకి 42 వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టిన పాండ్యా బౌలర్ల ర్యాంకులలో 25 స్థానాలు మెరుగుపరుచుకుని 70వ స్థానానికి చేరాడు.
కాగా ఇంగ్లండ్ తో తొలి వన్డే లో ఆరు వికెట్లతో కెరీర్ బెస్ట్ నమోదు చేసి వన్డే బౌలర్ల ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లిన బుమ్రా.. గాయంతో మూడో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడు అగ్రస్థానాన్ని మళ్లీ ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) కే అప్పగించాల్సి వచ్చింది. బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్.. నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 16వ స్థానానికి చేరాడు.
వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అదే దేశానికి చెందిన ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో డసెన్ నిలవగా టీమిండియా మాజీ సారథి ఒకస్థానం దిగజారి ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు.
A new No.1!
A busy week in ODI cricket has led to a number of changes in the @MRFWorldwide ICC Men’s Player Rankings.
Details 👇
— ICC (@ICC) July 20, 2022