న్యూఢిల్లీ: పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket team) వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్లలో అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఇవాళ 500వ విజయంతో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 500 మ్యాచ్లు గెలిచిన మూడో జట్టుగా పాక్ నిలిచింది. న్యూజిలాండ్తో సిరీస్లో భాగంగా ఇవాళ ఆ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. దాంతో పాక్ టీమ్ విజయాల సంఖ్య 500కు చేరుకుంది.
ఇవాళ్టితో మ్యాచ్తో కలిపి మొత్తం 949 మ్యాచ్లు ఆడిన పాకిస్థాన్ ఈరోజు గెలుపుతో 500వ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ కంటే ముందు రెండు జట్లు మాత్రమే ఈ ఘనత దక్కించుకున్నాయి. వాటిలో ఒకటి ఆస్ట్రేలియా కాగా, రెండో జట్టు ఇండియా. ఆస్ట్రేలియా టీమ్ మొత్తం 978 మ్యాచ్లు ఆడి 594 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నది.
టీమిండియా ఇప్పటివరకు మొత్తం 1029 మ్యాచ్లు ఆడి 539 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. తాజాగా ఇవాళ మూడో జట్టుగా పాకిస్థాన్ 500 విజయాల క్లబ్లో చేరింది. ఈ మూడు జట్ల తర్వాత వెస్టిండీస్ 411, దక్షిణాఫ్రికా 399, శ్రీలంక 399, ఇంగ్లండ్ 392, న్యూజిలాండ్ 368, బంగ్లాదేశ్ 149, జింబాబ్వే 147 విజయాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.