లండన్: లండన్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య WTC Final మ్యాచ్ జరుగుతున్న ఓవల్ మైదానంపై కూడా మబ్బులు కమ్ముకున్నాయి. లండన్లో ఇవాళ వర్షం కురిసే అవకాశం 30 శాతం వరకు ఉన్నదని యూకే వాతావరణ విభాగం తెలిపింది. ఈ మేరకు యూకే వాతావరణ కేంద్రం లండన్కు యెల్లో అలర్ట్ కూడా జారీచేసింది.
పరిస్థితిని బట్టి చూస్తే ఓవల్ మైదానం పరిసరాల్లో ఇవాళ మధ్యాహ్నంకల్లా వర్షంతోపాటు అక్కడక్కడా జల్లులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న WTC Final మ్యాచ్ సజావుగా సాగుతుందా.. లేదా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వర్షం రాకపోతే భారత్ విజయం కోసం 90 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉంది. ఆ లోపే ఏడు వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలువనున్నది.