ఛత్రపతి శంభాజీ నగర్: ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో సెప్టెంబర్లో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ము ందుకు నడిపించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
యువత సీజేపీలో చేరి ఈ ఉద్యమంలో భాగం కావాలన్నారు. పెరిగిన స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల ఫీజులు చాలా కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందకుండా చేస్తున్నాయన్నారు. ‘విద్యా సంస్కరణల కోసం మొదట పోరాడతాం.విద్యను అందరికీ అందుబాటు లో ఉండేలా చేయాలని అనుకుంటున్నాం’ అని దీప్కే అన్నారు.