Team India | భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో టీం ఇండియాకు మరోషాక్ తగిలింది. రెండు వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తొలి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలోనే మరో రెండు వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. అంతకుముందు టీం ఇండియా బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
అంతకుముందు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా 152 పరుగులు చేసింది. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (51) తన కెరీర్ లో తొలి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ కిషాన్ (27), హార్దిక్ పాండ్య (24) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లు అకీల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు తీశారు.