న్యూఢిల్లీ: కరోనా వైరస్ కలవరంతో భారత్-ఇంగ్లండ్ మధ్య గతవారం అర్ధాంతరంగా ఆగిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం ఈ టెస్టుకు సంబంధించి నిర్ణయం ఐసీసీ తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్ విషయంలో బీసీసీఐ రాజీ పడబోదని అన్నాడు. ‘ఇంగ్లండ్లో 2007 తర్వాత ఇదే మాకు మొదటి సిరీస్ విజయం. ఈ సిరీస్ను పూర్తి చేయాలని మేము భావిస్తున్నాం. కొవిడ్-19 కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో చాలా సిరీస్లు వాయిదాపడ్డాయి. గతేడాది దక్షిణాఫ్రికాతో జరుగాల్సిన టెస్టు సిరీస్నూ మేము రద్దు చేసుకున్నాం. కరోనా కారణంగా ఇంగ్లండ్తో ఐదో టెస్టు రైద్దెనందుకు మేము తీవ్ర నిరాశకు గురయ్యాం. కానీ కరోనా వ్యాప్తి, ఆటగాళ్ల భద్రత మాకు ముఖ్యం’ అని తెలిపాడు. టెస్టుకు బదులు ఇంగ్లండ్తో వచ్చే ఏడాది జూలైలో రెండు టీ20లు అదనంగా ఆడుతారా..? అన్న ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ.. అదనంగా వన్డేలు, టీ20లు ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని, అది సమస్య కాదని గంగూలీ తెలిపాడు.