ముంబై : కెప్టె న్ రోహిత్శర్మ విశ్రాంతి కావాలని కోరుకుంటే లీగ్ దశలో ఒకటి, రెండు మ్యాచ్లకు విశ్రాంతి కల్పించేందుకు సిద్ధమేనని ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్ బౌచర్ తెలిపాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబై గత సీజన్లో అట్టడుగున నిలిచింది.
ఈసారి మెరుగైన ప్రదర్శన చేసేందుకు జట్టు యాజమాన్యం ఆటగాళ్లపై పని ఒత్తిడి పడకుండా చూసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే రోహిత్కైనా విశ్రాంతి కల్పించేందుకు సిద్ధమేనని బౌచర్ వెల్లడించాడు. ఇన్నేళ్లుగా ఐపీఎల్లో ఆడుతున్నందున పని ఒత్తిడికి, అభిమానుల అంచనాల ప్రభావం తనపై ఉండదని రోహిత్ అన్నాడు.