ముంబై : కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సి టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ను యూఏఈకి మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి జే షా ఇవాళ మీడియాతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామని, టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకమైందన్నారు. టీ20 వరల్డ్కప్ను ఇండియాలో నిర్వహించాలా లేదా అన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని షా వెల్లడించారు. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో వరల్డ్కప్ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఫైనల్ మ్యాచ్ను నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.