హరారే: జట్టులో సీనియర్ ప్లేయర్గా.. యువ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటానని టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. గురువారం నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ధవన్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తొలుత ధవన్ను సారథిగా ఎంపిక చేసినా.. ఆ తర్వాత కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో జట్టు పగ్గాలు అతడికి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధవన్ మంగళవారం మాట్లాడుతూ.. ‘2013 నుంచి జట్టులో ఉన్నా. నా అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. యంగ్ ప్లేయర్స్ ఏదైనా సమస్యతో నా వద్దకు వస్తే దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు.