Yashasvi Jaiswal: ఇంగ్లండ్తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఇలాకాలో సంబురాలు జరుగుతున్నాయి. యశస్వి స్వస్థలం అయిన ఉత్తరప్రదేశ్లోని బదోహిలో క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. డప్పుచప్పుళ్లతో స్టెప్పులు వేశారు. ఈ సంబురాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Uttar Pradesh | People burst crackers and distributed sweets in Bhadohi – the hometown of cricketer Yashasvi Jaiswal as he hit a double-century today in the second test match against England. pic.twitter.com/kwB68wxQcc
— ANI (@ANI) February 3, 2024
కాగా, ఇంగ్లండ్తో వైజాగ్లో జరుగుతున్న రెండో టెస్టులో యశస్వీ జైస్వాల్ (207 నాటౌట్) డబుల్ సెంచరీ కొట్టాడు. ఓవర్ నైట్ స్కోర్ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఈ యంగ్స్టర్ తొలి సెషన్ మొదలైన కాసేటికే తొలి ద్విశతకం బాదాడు. 191 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్లో సిక్సర్ బాదిన యశస్వీ.. ఆ మరుసటి బంతికే స్క్వేర్ లెగ్లో బౌండరీ కొట్టి తన వ్యక్తిగత స్కోరును 200 పరుగులు దాటించాడు.