Wasim Jaffer : రంజీ దిగ్గజం వసీం జాఫర్(Wasim Jaffer) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడని తెలిసిందే. విదేశీ కామెంటేటర్ల వ్యాఖ్యలపై వినూత్నంగా స్పందిస్తూ నవ్వులు పూయించే జాఫర్ తాజాగా మరోసారి తన చతురతను ప్రదర్శించాడు. భారత్, ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్తో వార్తల్లోకెక్కాడు. ఇండోర్ వేదికగా టీమ్ఇండియా దంచికొడుతుండగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఫ్రంట్ లైన్ ప్లేయర్లు లేకపోయినా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు కంగారూలపై మెరుగైన ప్రదర్శన చేస్తుందంటూ వాన్ స్పందించాడు.
ఓపెనర్ శుభ్మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్((105) సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు చేయడం ఖాయమే అని వాన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. ‘టీమ్ఇండియా 400 పరుగులు సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది’ అని మరో ట్వీట్ చేశాడు. దీనిపై వసీమ్ జాఫర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ఏ పాడు కండ్లు పడొద్దు, ఎవరి దిష్టి తగలొద్దు అనే అర్థం వచ్చేలా పచ్చి మిరపకాయలు, నిమ్మకాయ, బొగ్గు ముక్క వేలాడదీసిన ఫొటోనూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారింది. మైఖేల్ వాన్కు సరిగ్గా బుద్ధి చెప్పిన జాఫర్ను అభిమానులు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.