న్యూఢిల్లీ: వరుస ఓటములతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు మరో తలనొప్పి. తొడకండరాల గాయంతో యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్రైజర్స్ మేనేజ్మెంట్ గురువారం ఒక ప్రకటనలో అధికారికంగా పేర్కొంది.
ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున ఏడు మ్యాచ్లాడిన సుందర్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్లో 48.66 సగటుతో మూడు వికెట్లకే పరిమితమైన ఈ స్పిన్ ఆల్రౌండర్ 66 పరుగులతో నిరాశపరిచాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సుందర్ మూడు వికెట్లు తీసుకున్నాడు.