న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు బీసీసీఐ శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ సిరీస్కు పరిగణనలోకి తీసుకోకపోగా.. వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చారు. ఐపీఎల్కు ముందే గాయపడి టీమ్కు దూరమైన దీపక్ చాహర్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి తిరిగి వచ్చాడు.
‘కేఎల్ రాహుల్ కొవిడ్-19 నుంచి కోలుకున్నాడు. కానీ.. అతడి కండరాల గాయం ఇంకా తగ్గలేదు. దీంతో అతడిని ఎంపిక చేయలేదు’అని బీసీసీఐ అధికారి తెలిపారు. కోహ్లీతో పాటు రోహిత్, పంత్, పాండ్యా, బుమ్రా, షమీకి విశ్రాంతినివ్వగా.. శిఖర్ ధవన్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రాహుల్ త్రిపాఠి.. తొలిసారి వన్డే జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు: ధవన్ (కెప్టెన్), రుతురాజ్, గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్, శాంసన్, సుందర్, శార్దూల్, కుల్దీప్, అక్షర్, అవేశ్, ప్రసిద్ధ్, సిరాజ్, దీపక్ చాహర్.